రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..ఎకరానికి ఇక రూ.10 వేలు

-

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అందించింది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్లతో పంట నష్టపోయిన అన్నదాతలకు ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టాన్ని ఇప్పటికీ రైతులు జిల్లాల వారిగా నివేదిక తయారు చేస్తున్నారని మంత్రి నాగేశ్వరరావు వెల్లడించారు. ఇక ఆ నివేదిక అందిన వెంటనే రైతుల ఖాతాల్లో నష్టపరిహారాన్ని చేస్తానని ఈ మేరకు హామీ ఇచ్చారు.

కాగా, గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో రాళ్ల వర్షాలు కురవడంతో పంట నీట మునిగింది. దీంతో పెట్టిన పెట్టుబడి రాక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా రైతుబంధు సాయాన్ని కొనసాగిస్తామని, 3 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే పెట్టుబడి సాయాన్ని జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.రైతు బంధు నిరంతర ప్రక్రియ అని, మార్చి నెలాఖరు అందరి ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నట్లు తెలిపారు. రైతు రుణమాఫీపై కూడా కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news