తిరుమల భక్తులకు శుభవార్త.. స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల జారీ ప్రారంభం

-

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ బోర్డు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యం లోనే తిరుమల సర్వదర్శనం టోకెన్లు భక్తులందరికి జారీ చెయ్యడం ప్రారంభించింది టిటిడి బోర్డు. మొదట ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా వాసులుకు మాత్రమే టోకెన్లు జారి చేసిన టీటీడీ బోర్డు… ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వారికి కూడా టోకెన్లు ఇస్తోంది.

తమిళలకు ముఖ్యమైన పెరటాసి మాసం కావడం తో పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. ప్రస్తూతం జారీ చేస్తూన్న… 2 వేల నుంచి 8 వేలకు టోకెన్లు పెంచింది టిటిడి. ఇందులో భాగంగానే… ఇవాళ నుంచి నూతన విధానాన్ని అమలు చేస్తోంది టిటిడి. టోకెన్లు సంఖ్య పెంచడం తో శ్రీవారి ఆలయంలో దర్శన సమయాన్ని కూడా పెంచింది టిటిడి. ఇవాళ నుంచి ఏకాంత సేవను 11 :30 గంటలకు నిర్వహించనుంది టిటిడీ బోర్డు. దీంతో శ్రీవారి భక్తులకు భారీ ఊరట కలుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news