టీటీడీ ఉద్యోగులకు శుభవార్త..పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు

-

టీటీడీ ఉద్యోగులకు శుభవార్త జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తిరుమల టిటిడి ఉద్యోగులకు చెల్లించే జీతాలపై కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్‌. జనవరి నెలకు సంభందించి పాత జీతాలే చెల్లించాలని.. అంటే పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సర్కార్‌. టిటిడిలో అమలులోకి రాని పీఆర్సీపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్ట ప్రభుత్వం జిఓ జారి చేసింది.

ttd

17వ తేదిన పాలక మండలి సమావేశంలో జిఓ అమలు పై నిర్ణయం తీసుకోనుంది టీటీడీ పాలకమండలి. మార్చిలో కొత్త జిఓ మేరకు జీతాలు చెల్లించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ.. కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి మాసం జీతాలు ఇవ్వాలని.. జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. జగన్‌ మోహన్‌ రెడ్డి  సర్కార్‌ తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version