గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్..!

-

యూత్ విహారయాత్రకు వెళ్ళాలి అనుకుంటే ముందుగా గోవా కు వెళదామని ప్లాన్ లు వేసుకుంటారు. అక్కడ యూత్ కు కావాల్సినంత వినోదం ఉంటుంది. అయితే గోవా వెళ్ళాలి అంటే ఫ్లైట్ లేదా కార్ అయితే ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కానీ ట్రైన్ లో వెళితే తక్కువ డబ్బులతో వెళ్లి ఎంజాయ్ చేసి రావొచ్చు.

ఇక తాజాగా ఖర్చు తక్కువ అయ్యేలా రాష్ట్ర రైల్వే శాఖ గోవా వెళ్ళే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 28 నుండి కొత్త రైలు అందుబాటులోకి రానుంది. జార్ఖండ్ లోని జసిడి నుండి బయలుదేరి సికింద్రాబాద్ మీదగా వాస్కొడిగామా కు చేరుకుంటుంది. ఇక ఈ ట్రైన్ రాష్ట్రం లో మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్, వికారాబాద్ స్టేషన్లలో ఆగనుంది. 28 న జసిడీ నుండి బయలు దేరే ట్రైన్ 29న మధ్యానం 2:35 కు మంచిర్యాల, 4:10 కి కాజీపేట కు, రాత్రి 7.40 గంటలకు వికారాబాద్ కు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news