శ్రీ వారి భక్తులకి శుభవార్త

-

తిరుమల శ్రీ వారి సర్వ దర్శనం భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సర్వ దర్శనం టోకెన్ లను పది వేల నుంచి ఏకంగా ఇరవై వేలకి టీటీడీ పెంచింది. టిటిడి తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే విష్ణు నివాసంతో పాటు భూ దేవి కాంప్లెక్స్ లో ఈ సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రారంభం అయింది.

ttd
ttd

టికెట్లను పొందేందుకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలను పాటించాలని, మాస్క్ ధరించి రావాలని, చేతులను శానిటైజ్ చేసుకుంటూ భౌతిక దూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు. ఇక నిన్నటి లెక్కల ప్రకారం శ్రీవారిని 47 వేల 900 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 19320 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం మూడు కోట్లు గా తేలింది. 

Read more RELATED
Recommended to you

Latest news