మహిళలకు గుడ్ న్యూస్… వాటి ధరలు తగ్గాయి !

-

ప్రస్తుతం నిత్యవసర సరుకుల దగ్గర నుండి బంగారం వరకు అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు ఏదైనా కొనాలి అంటే లెక్కలు వేసుకునే పరిస్థితిని తీసుకువచ్చారు. కాగా ఇంత ధరల లోనూ సంతోషించే ఒక్క విషయం వంట నూనె ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి అని వార్తలు వస్తున్నాయి. మన దేశంలో దారా అనే బ్రాండ్ తో వంట నూనెలను అమ్ముతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దారా బ్రాండ్ ను తయారు చేసే సంస్థ మదర్ డెయిర్ తెలిపింది.

నెక్స్ట్ వీక్ నుండి నూనె ప్యాకెట్ లు తగ్గిన ధరలతో మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. అంతర్జాతీయంగా తగ్గుతున్న ధరల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కారణంగా సోయాబీన్ నూనె ధర లీటర్ కు రూ. 20, రైస్ బ్రాన్ నూనె రూ. 20, సన్ ఫ్లవర్ రూ. 5 మరియు వేరుశనగ రూ. 15 తగ్గనున్నాయి. ఈ వార్త తెలిసిన గృహిణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version