సీఎం కేసీఆర్‌ కు షాక్‌..నేడు మరోసారి ఢిల్లీకి తెలంగాణ గవర్నర్‌

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కు షాక్‌ తగులనుంది. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పది రోజుల కిందట ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తమిళి సై ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షా తో భేటీ అయి వచ్చారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తనపై వ్యవహరిస్తున్న తీరు, ప్రోటోకాల్‌ వివాదంతో పాటు రాజకీయ పరిస్థితులపైనా నివేదిక సమర్పించారు. అయితే.. మరోసారి ఢిల్లీకి వెళ్లిన గవర్నర్‌ తమిళి సై కేంద్ర సహాయ మంత్రి జితేందర్‌ సింగ్‌ కుమారుడి వివాహానికి హాజరు కానున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రధాని, కేంద్ర మంత్రులను మరోసారి గవర్నర్‌ తమిళి సై కలిసే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే రాజ్‌ భవన్‌, ప్రగతి భవన్‌ ల మధ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంతో… ఆమె ఏయే విషయాలు చర్చిస్తారనేది ఆసక్తి గా మారింది. అయితే… ఇవాళ ప్రధానితో గవర్నర్‌ తో ఏం మాట్లాడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version