ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చే వారికి ఆటోమేటిక్ ఈ-పాస్ జారీకి ప్రభుత్వం నిర్ణయం..!

-

ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయాణికుల అనుమతి నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. మూడోదశ అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా ఈ మేరకు నిబంధనల్లో సడలింపులు ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆటోమేటిక్ ఈ-పాస్ జారీ చేయాలని నిర్ణయించింది. స్పందన వెబ్‌సైట్‌లో పాస్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ పాస్ జారీ చేయనున్నారు.

Ap government
Ap government

దరఖాస్తు చేసిన వెంటనే ప్రయాణికుడి మొబైల్, ఈ మెయిల్‌కు అధికారులు ఈ పాస్ పంపనున్నారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ఈ పాస్‌తో పాటు తగిన గుర్తింపు కార్డు చూపించి రాష్ట్రంలో ప్రవేశించవచ్చని ప్రభుత్వం తెలిపింది. రేపటి నుంచి ఆటోమేటిక్ ఈ పాస్‌లు జారీచేయనున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. చెక్ పోస్టుల వద్ద నమోదు చేసుకున్న ప్రయాణికుల వివరాలు ఆరోగ్యశాఖ ద్వారా స్థానిక సిబ్బందికి అధికారులు పంపనున్నారు. స్థానిక వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news