మెగాస్టార్ చిరంజీవిని సత్కరించిన గవర్నర్ తమిళిసై

-

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవికి భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ కేంద్రం ప్రకటించింది. ఒక కానిస్టేబుల్ కొడుకుగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి సొంతంగా కష్టపడి 150కి పైగా సినిమాలలో నటించాడు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సహాయము అందించాడు. పద్మ విభూషణ్ అవార్డు రావడంతో చిరంజీవికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అభినందనలు తెలిపారు.

ఇక తాజాగా పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన చిరంజీవిని తెలంగాణ గవర్నర్ తమిళిసై దంపతులు రాజ్భవన్ లో సత్కరించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి తో పాటు తన సతీమణి సురేఖ హాజరయ్యారు. ఈ ఫొటోలను మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తూ.. ‘నాకు ఆతిథ్యమిచ్చి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు. తమిళిసై, ఆమె భర్త సౌందరరాజన్ మాట్లాడినందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news