శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం సిద్దిపేట రామాలయంలో సీతా రామచంద్ర స్వామి కళ్యానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతూ..
‘రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్నది.సిద్దిపేటలోని రాముల వారి ఆలయంలో కల్యాణానికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది.ఆ సీతారామచంద్ర ఆశీస్సులతో ఈ దేశం, రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని.. సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పాలకులకు మంచి భక్తిని ముక్తిని కలిగిస్తూ.. వారికి మంచి పాలన అందించే విధంగా రాముల వారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను’ అని వ్యాఖ్యానించారు.