గ్రూప్-1 అభ్యర్థుల నిరసన.. టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సంచలన నిర్ణయం!

-

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈనెల 21 నుంచి నిర్వహించేందుకు టీజీపీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. అయితే, గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ మరో నాలుగు రోజుల్లో జరుగుతుందనుకునే సమయంలో ఆ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు మరోసారి రోడ్డెక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించకుండా పరీక్ష నిర్వహించవద్దని గత రాత్రి అశోక్‌నగర్ వద్ద ఆందోళన చేపట్టారు.

తాజాగా గురువారం ఉదయం గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.దీంతో అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని పోలీసులను ఆదేశించారు. అభ్యర్థుల డిమాండ్లను విన్నాక ప్రభుత్వంతో మాట్లాడాలని టీపీసీసీ చీఫ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news