ఓఎంఆర్ విధానంలో గ్రూప్-1 పరీక్ష: టీఎస్ పీఎస్సీ

-

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్లైన్లో(ఓఎంఆర్ విధానం) నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది.రాష్ట్రంలో కొత్తగా 60 పోస్టులను కలిపి 563 గ్రూప్-1 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 9న జరగనున్న ఈ పరీక్షకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 21 మెయిన్స్ పరీక్ష జరగనుందిఈ ఏడాది ఫిబ్రవరి 19న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

కాగా…గతంలో లో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే.2022 ఏప్రిల్ లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయగా,పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడితే.. మరొకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని రెండోసారి కూడా ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version