ఈనెల 14 నుంచి గ్రూపు 1 మెయిన్స్ హాల్ టికెట్స్..!

-

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి 27 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షలు రెండు, మూడు సార్లు వాయిదా పడిన తరువాత మళ్లీ నిర్వహించారు. గ్రూపు 1 మెయిన్  పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈ నెల 14నుంచి జారీ చేయనున్నట్లుగా టీజీపీఎస్సీ ప్రకటించింది.

ఇప్పటికే పరీక్షల సమయంలో అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలను ఉల్లంఘించవద్దని స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ కు మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించారు. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించారు. గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ అనుసరించి గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news