BREAKING : తెలంగాణలో గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్షలు రద్దు

-

TSPSC పేపర్ లీకేజీ ఘటనపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు పేపర్ లీకేజీ ఘటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

ఇంకోవైపు ఈ ఘటనపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ తరుణంలో.. టీఎస్‌పీఎస్సీ మరో కీలక నిర్నయం తీసుకుంది. తాజాగా తెలంగాణలో గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్షలు రద్దు చేసింది TSPSC. వరుసగా పరీక్షలను రద్దు చేస్తున్న టీఎస్పీఎస్సీ… జూనియర్‌ లెక్టరర్‌ పోస్టు పరీక్షలను కూడా రద్దు చేసింది. దీంతోపాటు ఏఈఈ, డిఏఓ పరీక్షలను సైతం రద్దు చేసింది. OCT 16న 503 పోస్టులకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. 1:50 నిష్పత్తిలో 25,150 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news