మహేష్ బాబు “గుంటూరు కారం” సినిమా సంక్రాంతికి డౌటేనా ?

-

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ వాంటెడ్ మూవీ గుంటూరు కారం.. ఈ సినిమా టైటిల్ ను ప్రకటించిన నాటి నుండి మహేష్ బాబు అభిమానులలో చాలా సందేహాలు నెలకొన్నాయి. ఇక త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో రానున్న మూడవ చిత్రం కావడంతో టాలీవుడ్ లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ కావడం లేదు అని సోషల్ మీడియాలో వార్తలు రావడంతో చిత్ర నిర్మాత నాగవంశీ స్పందించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి హీరోయిన్ గా పూజ హెగ్డే ను చిత్ర బృందం తొలగించింది, అదే విధంగా సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ను సైతం తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక సినిమా రిలీజ్ గురించి నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్లుగా గుంటూరు కారం మూవీ సంక్రాంతికి వాయిదా పడడం లేదని, ఎటువంటి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలియచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news