బుగ్గన ఆర్థికమంత్రి కాదు.. అప్పుల మంత్రి : బీజేపీ ఎంపీ

-

ఢిల్లీ : బుగ్గన రాజేంద్ర నాథ్ ని ఆర్థిక మంత్రి అనడం కన్నా అప్పుల మంత్రి అంటే బాగుంటుందని బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు చురకలు అంటించారు. ఏపీ అప్పుల ఆంద్రప్రదేశ్ గా మారిందని దేశం మొత్తానికి తెలిసిందని.. కొత్త అప్పుల కోసం రోజూ ప్రయత్నాలు చేసే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఓటు బ్యాంకు కోసం, పథకాల కోసం రుణాలు తీసుకుంటున్నారని..ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు.

పెన్షన్లు..జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని.. అప్పుల పై చూపించే శ్రద్ధ మరేతర అంశంపై ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. రోజూ కొత్త అప్పులు తీసుకొచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారని.. అప్పులు పుట్టించడానికి ఏపిలో “స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్” ఏర్పాటు చేసుకున్నట్లు గా ఉందని ఎద్దేవా చేశారు. “ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్” ఏర్పాటు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరణలు చేసుకోవాలని పేర్కొన్నారు.

“ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్” ఏర్పాటు, అప్పులు చేయడం, రాజ్యాంగ ఉల్లంఘనల అంశాలను కేంద్ర ఆర్ధికమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అప్పులు చేస్తుందో “కాగ్” తో “స్పెషల్ లోన్ ఆడిట్” చేయుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని పేర్కొన్నారు. ఏపి ప్రభుత్వం “ఎఫ్.ఆర్.బి.ఎమ్”పరిధి దాటి కార్పోరేషన్ పేరుతో అప్పులు చేస్తోందని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news