హోమ్ మినిస్టర్ అమిత్ షాను కలిసిన ‘హనుమాన్’ మూవీ టీమ్

-

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.ఈ సినిమాలో కథానాయికగా అమృతా అయ్యర్ నటించింది. మరో కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది.

ఇదిలా ఉంటే… కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ‘హనుమాన్’ సినిమా హీరో తేజా సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలిశారు.తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో ఈ భేటీ జరిగింది. అమిత్ షాను కలవడం సంతోషంగా ఉందని ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా లో ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news