50 మంది మైనర్లపై లైంగిక దోపిడీ వీడియోలు మరియు ఫోటోలతో

-

గత కొన్నేళ్ళుగా దాదాపుగా 50 మంది మైనర్లపై లైంగిక దోపిడీకి పాల్పడటమే కాకుండా వారి వీడియోలు మరియు ఫోటోలను డార్క్ నెట్‌ లో దాదాపు 10 ఏళ్లుగా విక్రయించినందుకు గానూ… ఉత్తర ప్రదేశ్ నీటిపారుదల విభాగంలో జూనియర్ ఇంజనీర్‌ ను సిబిఐ అదుపులోకి తీసుకుంది. వివరాల్లోకి వెళితే… ఉత్తర ప్రదేశ్ చిత్రకూట్ జిల్లాలో నివాసం ఉండే… రంభవాన్‌ 5-16 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను లైంగికంగా వేధించే వాడు.

ఉత్తరప్రదేశ్‌ లోని బండా, చిత్రకూట్, పరిసర ప్రాంతాలకు చెందిన పిల్లలను వేధించి వీడియోలు తీసే వాడు. శారీరక వేధింపులతో పాటుగా… తమ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి వాటిని రికార్డ్ చేసి డార్క్ నెట్ కి విక్రయించే వాడు. అయితే వారు బయటకు చెప్పకుండా ఉండటానికి గానూ వారికి మొబైల్స్ సహా డబ్బు ఇచ్చే వాడు అని సిబిఐ అధికారులు గుర్తించారు.

స్కైప్ సహా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వారి ఫోటోలను వీడియోలను ప్రసారం చేసాడు అని విచారణలో వెల్లడి అయింది. దీనిపై స్పందించిన సిబిఐ అధికారులు… “నిందితులు డార్క్ వెబ్‌ లో వీడియోలను విక్రయించారు. వాటిని వేరే వారికి షేర్ చేసారు అని వెల్లడించారు. సిబిఐ సోమవారం రాంభవాన్ నివాసంపై దాడి చేసి… రూ .8 లక్షల నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ లు, వెబ్ కెమెరా మరియు పెన్ డ్రైవ్‌లు, మెమరీ కార్డులు మరియు అనేక సెక్స్ బొమ్మలతో సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. 5-16 సంవత్సరాల వయస్సులోపు పిల్లలను ఆకర్షించడానికి రంభవాన్ ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు గాడ్జెట్లను ఉపయోగించాడని సిబిఐ అధికారులు వెల్లడించారు. ఈ వీడియోలను విదేశాలకు కూడా అతను పంపించాడు అని సిబిఐ అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news