ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పడుకున్న మహిళలకు వేధింపులు..

-

ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో ఓ మహిళల దారుణమైన అనుభవం ఎదురైంది. ఓ ప్యాసింజర్ ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీ-చెన్నై ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. అయితే, ప్రయాణ సమయంలో నిందితుడు వెనకాలే కూర్చున్నాడని ఆమె ఫిర్యాదులో తెలిపింది.

ఆమె నిద్రపోతున్నపుడు తన వెనుక సీట్లో కూర్చున్న 43 ఏళ్ల రాజేశ్ కావాలని తన శరీరాన్ని తాకాడని మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. గురువారం సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలో విమానం ల్యాండ్ అయ్యాక బాధిత మహిళ ఎయిర్‌లైన్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో రాజేష్‌శర్మ అనే వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు.భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) చట్టం కింద శర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాజస్థాన్‌‌కు చెందిన వ్యక్తి కాగా, గత కొంతకాలంగా చెన్నైలోనే నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news