3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే.. పవన్ కళ్యాణ్ 5 ఏళ్లు సీఎంగా ఉంటారు – హరిరామ జోగయ్య

-

3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే.. పవన్ కళ్యాణ్ 5 ఏళ్లు సీఎంగా ఉంటారని తెలిపారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. తాజాగా మాజీ మంత్రి హరిరామ జోగయ్య మీడియాతో మాట్లాడారు. 175 స్థానాల్లో జనసేన పోటీ చేసిన ఎలాంటి ఇబ్బంది లేదని ఈ సందర్భంగా తెలిపారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య.

గతం కంటే జనసేన బలం పెరిగింది.. మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ 5ఏళ్లు సీఎంగా వుంటారని చెప్పారు. ఒంటరిగా వెళ్ళలనుకుంటే బీజేపీ నీ కలుపుకొని వెళ్ళడం వల్ల వచ్చే జనసేనకి లాభమే తప్ప.. నష్టం ఏమీలేదన్నారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. జనసేన- టిడిపి కలసి పోటీ చేస్తే వైసీపీ ఓడించడం మరింత సులువు అవుతుంది.. మోడీ చరిష్మా పవన్ కు కలసి వస్తుందని వివరించారు. కాపులంతా అన్ని వర్గాలను కలుపుకొని పవన్ కళ్యాణ్ కు 100 శాతం సహకరించాలని కోరారు మాజీ మంత్రి హరిరామ జోగ య్య.

Read more RELATED
Recommended to you

Latest news