నల్లగొండ కి చేరిన కేటీఆర్, హరీష్ రావు..!

-

కృష్ణ బేసిన్ ప్రాజెక్ట్ లని కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభని నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలో అసెంబ్లీ నుండి కేటీఆర్ అలానే హరీష్ రావులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులలో నల్లగొండ కి చేరుకున్నారు.

harish rao comments on ktr

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి కేటీఆర్ హరీష్ రావు కడియం చేరుకున్నారు. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత సభ ప్రాంగణానికి వెళ్లబోతున్నారు ఇప్పటికే ఉమ్మడి జిల్లాల నుండి బిఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున నల్లగొండకి చేరుకున్నారు. సాయంత్రం సభ ప్రారంభం అవుతుంది మాజీ సీఎం డైరెక్ట్ గా తన నివాసం నుండి హెలికాప్టర్లో అక్కడికి చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి కెసిఆర్ సభలో పాల్గొనడం తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తికరంగా ఆయన స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news