ఏసీబీ వలలో శామీర్ పేట తహశీల్దార్..!

-

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండల తహశీల్దార్ సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కారు. రూ.10లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. గచ్చిబౌలిలో ఉంటున్న ఓ వ్యక్తికి చెందిన భూమి శామీర్ పేటలో కలదు. దానికి సంబంధించిన పట్టాదార్ పాసు పుస్తకం జారీ చేసేందుకు తహశీల్దార్ రూ.10లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. తహశీల్దార్ సత్యనారాయణ, డ్రైవర్ బద్రి డబ్బు తీసుకుంటుండగా.. అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహశీల్దార్ తీసుకోమంటేనే డబ్బు తీసుకున్నట్టు డ్రైవర్ బద్రి అంగీకరించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో తహశీల్దార్ సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news