హైదరాబాద్ కు 3 దిక్కులా సముద్రం ఉందట..రేవంత్‌ పరువు తీసిన హరీష్‌ !

-

సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు షాకింగ్‌ కామెంట్స్ చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్బుత విన్యాసం చూసామని… ఇచ్చిన హామీలు దృష్టి మరల్చే విధంగా చేస్తున్నారని ఆగ్రహించారు. హైదరాబాద్ కు మూడు దిక్కులా సముద్రం ఉంది అని సీఎం అంటున్నారని.. హైదరాబాద్ లో మాత్రమే నగరం మధ్యలో నుంచి నది వెళుతోంది అన్నారని చురకలు అంటించారు. చాలా నగరాల మధ్యలో నది వెళ్తుందని గుర్తు చేశారు.


బీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రతిపక్షం గా ఉండి ఒక్క సీటు గెలవలేదు అన్నారని… కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షం గా ఒక్క సీటు కూడా గెలవలేదని సెటైర్లు పేల్చారు.
సీఎం ప్రెస్ మీట్ లో చాలా అబద్ధాలు మాట్లాడారన్నారు. గ్రాఫిక్ హంగులతో సిఎం రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ డ్రీమ్ ప్రాజెక్ట్ ను నిన్న ప్రెస్ మీట్ లో చూపించారని ఆగ్రహించారు. మూసీ సుందరీకరణ కు brs వ్యతిరేకం కాదని తెలి పారు. మూసీ సుందరీకరణ ను brs ఎప్పుడో ప్రారంభం చేసిందని గుర్తు చేశారు. దీని పేరుతో పేదల ఇండ్లు కూలగొడతాం అంటున్నారు… దానికి మేము వ్యతిరేకమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news