గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా మారుద్దాం : హరీష్ రావు

-

కరీంనగర్ జిల్లా : హుజూరాబాద్ ప్రజల సహకారంతో గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా మార్చి.. సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇద్దామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. వీణవంకలో 2-3 రోజుల్లో 24/7 పనిచేసేలా ఆస్పత్రి, పోస్ట్ మార్టం కేంద్రం మంజూరుకు కృషి చేస్తానని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, వివేక్, సంజయ్ ఇక్కడి వాళ్లా? అసహనంతో ఈటెల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

harish rao | హరీష్ రావు
harish rao | హరీష్ రావు

బీజేపీ ప్రభుత్వంలో అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్ వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని.. బీజేపీ అమ్మకానికి.. టీఆర్ఎస్ నమ్మకానికి మరో రూపమని తెలిపారు. చావు నోట్లో తలపెట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని.. 24 గంటల కరెంటు ఇస్తామంటే కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారని మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని.. కాళేశ్వరం పూర్తవుతదా అన్నారు.. రైతులు వద్దనే రీతిలో నీళ్లు వస్తున్నాయని గుర్తు చేశారు. హుజూరాబాద్ లో టిఆర్ఎస్ గెలుపు ను ఎవరు ఆపలేరని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news