అభివృద్ధి ఆగిపోతుంది.. ప్రజలు ఆలోచన చేయాలి !

-

ఆర్ సి పురం డివిజన్లలో ఈరోజు మంత్రి హరీశ్ రావు ఎలక్షన్ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెరాస  ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం  అని అందుకే మా అభ్యర్థులను జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ డిసెంబర్ నెల నుండి వాటర్ బిల్లుల వసూలు‌ రద్దు చేస్తున్నామని ఆయన అన్నారు. అదే విధంగా కోవిడ్ కారణంగా మధ్య తరగతి ప్రజలు కష్టాలను అర్థం చేసుకున్న గొప్ప ప్రభుత్వం ప్రాపర్టీ టాక్స్ లో 50 శాతం తగ్గించిందని అన్నారు.

మూడు సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇతర పార్టీ వాళ్ళు మేము ఏదో చేస్తామని ప్రజలను మభ్యపెడుతూ‌ నాటకాలాడుతున్నాయని  ప్రజలు  ఆలోచన చేయాలని అన్నారు. అభివృద్ధి చేసే తెరాస బిడ్డలకు ఓటు వేయాలని అన్నారు. బిజెపి నేతలు మేం హైదరాబాద్ అభివృద్ధి చేస్తామని‌ ప్రచారం చేస్తుంటే‌  వారి పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేం స్థానిక‌ సంస్థలకు నేరుగా నిధులు ఇవ్వలేమని అంటారు.  ఇలా ప్రజలను మభ్యపెడుతూ పూట గడుపుతున్న పార్టీలకు ఓటు వేస్తే మన అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. విజ్ఞానవంతులైన  ప్రజలు ఆలోచన చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news