IND VS PAK : ఇండియన్‌ లేడికి ‘ఐ లవ్‌ ఇండియా’ చెప్పిన పాక్‌ క్రికెటర్‌

-

ఆసియా కప్‌ 2022 లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌ లో టీమిండియా.. 5 వికెట్ల తేడాతో పాక్‌ పై గెలిచింది. మొదట పాకిస్తాన్‌ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌట్‌ కాగా.. ఇండియా ఆ లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించింది. అయితే.. ఇది ఇలా ఉండగా… పాకిస్తాన్ పైసర్ హాసన్ ఆలీ భారతీయ మహిళ అభిమానికి ఫిదా అయ్యాడు.

తనపై ఆమె చూపించిన అభిమానానికి ముగ్ధుడైన హాసన్ అలీ, ‘ఐ లవ్ ఇండియా’ అని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయంలోకి వెళితే, మంగళవారం రాత్రి పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారత్ కు చెందిన ఒక మహిళ అభిమాని అక్కడికి వచ్చింది. ఆమెతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. కాగా పాక్ క్రికెటర్లంతా ప్రాక్టీస్ ముగించుకొని డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తున్న సమయంలో తమ కెమెరాలతో ఫోటోలు క్లిక్ అనిపించారు.

ఈ సమయంలో అక్కడి నుంచి వెళుతున్న హాసన్ ఆలీని ఆపి, “మీకు భారత్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు”.అని మహిళ పక్కన ఉన్న వ్యక్తి పేర్కొంటూ సెల్ఫీ కావాలని అడిగాడు. “అవును మాకు ఇండియాలో కూడా అభిమానులు ఉంటారు, ఐ లవ్ ఇండియా”, అని పేర్కొన్నాడు. ఆ తర్వాత సదరు మహిళతో ఫోటోలకు ఫోజు ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news