పదో తరగతి పూర్తి చేసారా..? 1675 ఉద్యోగాలు..ఇలా అప్లై చెయ్యండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర నిఘా విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

 

కేంద్ర నిఘా విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో విశాఖపట్నంతో పాటు దేశం లోని వివిధ రాష్ట్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా వున్నాయి. 1675 పోస్టులు వున్నాయి. పోస్టుల వివరాలని చూస్తే.. సెక్యురిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌, మల్టిపుల్ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక అర్హత వివరాలని చుస్తే.. పదో తరతగతి లేదా తత్సమాన కోర్సు ని పూర్తి చేసి ఉండాలి.

దానితో పాటుగా ప్రాంతీయ భాష లో నైపుణ్యం ఉండాలి. ఫిబ్రవరి 10, 2023వ తేదీలోపు ఈ పోస్టుల కి అప్లై చేసుకోవాల్సి వుంది. వయస్సు 27 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రూ.500లు అప్లికేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. టైర్ 1, టైర్ 2, టైర్ 3 రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా ఇస్తారు. పూర్తి వివరాలని https://www.mha.gov.in/ లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version