ఆయన వ్యక్తిగత పనుల కోసమే పార్టీ మారారు.. కేటీఆర్ ఫైర్

-

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీ మార్పుపై ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. సంజయ్ బీఆర్ఎస్ నుండి వెళ్లిపోవడంతో జగిత్యాలకు పట్టిన శని వదిలిపోయిందని అన్నారు. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే.. సంజయ్‌ ఎంగిలి మెతుకులకు ఆశపడి కాంగ్రెస్ పార్టీలోకి పోయారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వ్యక్తిగత పనుల కోసమే ఆయన పార్టీ మారారని ఫైర్ అయ్యారు.

రాజకీయాల్లో హత్యాలుండవని, ఆత్మహత్యలే ఉంటాయని.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోయి రాజకీయ ఆత్మహత్య చేసుకున్నాడనిసంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను, సోదరి కవిత వచ్చి గల్లీ గల్లీలో తిరిగి బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించుకొని సంజయ్‌ను జగిత్యాల నుండి తరిమికొడుదామని అన్నారు . కాగా, ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్‌పై కేటీఆర్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news