ఈత కోసం బావిలోకి దిగాడు… షాక్​తో ప్రాణం విడిచాడు

-

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా జమ్మలమడుగు మండలం పి.బొమ్మేపల్లిలో విషాదం జరిగింది. సరదాగా ఓ యువకుడు బావిలోకి ఈత కొట్టేందుకు దిగి… విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జమ్మలమడుగుకు చెందిన అంకాలమ్మ-గుర్రప్ప దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు గురుప్రసాద్ (16) ఇటీవలే కడపలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు.తన స్వగ్రామమైన పి. బొమ్మేపల్లి గ్రామానికి వెళ్లి అంకాలమ్మ ఆలయం వెనకాల ఉన్న బావిలోకి ఈత కోసం దిగాడు.

ఈత కొడుతుండగా మెట్ల వద్ద ఉన్న ఇనుప పైపులను పట్టుకున్నాడు. పైపునకు కరెంటు ప్రసరించడంతో ఆ పైపు వెంటే అడుగుకు జారిపోయాడు. ఎంతసేపటికి పైకి రాకపోవడంతో గట్టుపైన ఉన్న సమీప బంధువు కరెంట్ ఆపేసి.. స్థానిక రైతుల సాయంతో బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడిని పైకిలాగి వెంటనే జమ్మలమడుగులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ యువకుడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు.

Read more RELATED
Recommended to you

Latest news