మద్యం మత్తులో హెడ్ కానిస్టేబుల్ వీరంగం

-

మహిళపై చెప్పుతో దాడి

గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు  కావరంలో ఓ మహిళపై చెప్పుతో దాడి చేశారు. విచారణ పేరుతో ఆదివారం రాత్రి 11 గంటలకు కొందరు మహిళలను స్టేషన్ కు తీసుకొచ్చారు. మద్యం మత్తులో ఉన్న ఆయన బూతులు తిడుతూ… మహిళను చెప్పుతో కొట్టాడు. ఈ దృశ్యాల‌ను అక్కడున్న కొందరు తమ ఫోన్ కెమెరాలతో తీయడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు స్పందించారు. స్టేషన్లో ఎవరి అనుమతి లేకుండానే మహిళలను అర్థరాత్రి పూట స్టేషన్ కు తీసుకొచ్చి నట్లు తెలిసిందని చెప్పారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కానిస్టేబుల్ స్థాయి అధికారే ఇలా చేస్తే ఉన్నతాధికారులు తమ అధికారంతో మరెంతగా రెచ్చిపోతున్నారో అని సర్వత్రా చర్చనీయంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news