బ్రేకింగ్ : మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్.. 26 మంది మావోయిస్టులు మృతి

-

మహారాష్ట్ర లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చి రోలీ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఏకంగా 26 మంది మావోయిస్టులు మృతి చెందారు.

అంతే కాదు ముగ్గురు జవాన్ల కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు గడ్చిరోలి జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్. ధనిరా తాలూకా గ్యార బట్టి అడవి ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్ స్పష్టం చేశారు.

ఉదయం 6 గంటల సమయం నుంచి… మధ్యాహ్నం వరకు పోలీసులు… అలాగే మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగినట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్.. మీడియాకు తెలిపారు. పక్కా సమాచారం మేరకు మావోయిస్టుల స్థావరం పై తాము దాడులు చేసినట్లు ఆయన ప్రకటించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఎస్పీ అంకిత్ గోయల్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news