అనంతపురంలో భారీ వర్షాలు..కాలనీలను ముంచేసిన ‘పండమేరు’

-

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల అనంతపురంలో కురిసిన భారీ వర్షానికి ‘పండమేరు’ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వర్షాల ధాటికి అనంతపురంలో వరద పోటెత్తింది.దీంతో ఇరువైపులా ఉన్న కాలనీలు నీటమునిగాయి. నగరంలోని చాలా ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయ.కనగానపల్లి చెరువు కట్ట తెగడంతో పండమేరుకు వరద పోటెత్తినట్లు తెలుస్తోంది.

వరదల ధాటికి టూ వీలర్లు, ఆటోలు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. జీవనోపాధి కళ్ల ముందే కొట్టుకుపోవడంతో అక్కడి ముంపు బాధితులు కంటతడి పెట్టారు. వరద పెరుగుతుండటంతో బాధితుల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగుతుండటంతో హైదరాబాద్- బెంగళూరు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొత్త చెరువు – ధర్మవరం ప్రధాన రహదారిపై వంగపుయేరు ప్రవాహిస్తుండటంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news