మహారాష్ట్రలో కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి

-

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనుకోకుండా ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలింది.ఈ ప్రమాదంలో పైలట్‌,ఇద్దరు ఇంజనీర్లు దుర్మరణం పాలయ్యారు. పుణె జిల్లాలో బుధవారం ఉదయం హెలికాప్టర్ కూలిపోయి మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారని స్థానిక పోలీసులు వెల్లడింటారు. అది ప్రభుత్వానిదా లేక ప్రైవేట్‌ హెలికాప్టర్‌నా అనేది తెలియరాలేదు.

పుణెలోని బవ్‌ధాన్ బుద్రుక్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రాథమిక నివేదికలో వాతావరణం సరిగా లేకపోవడమే ప్రమాదానికి కారణమని వెల్లడించినట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం..‘పుణె జిల్లాలోని బవ్‌ధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, ప్రస్తుతం మంటల్లో కాలిపోతున్న హెలికాప్టర్ ఎవరిది అనేది ఇంకా నిర్ధారించబడలేదు’అని వారు నిర్దారించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version