ముందుకొస్తున్న తెలుగు ఇండస్ట్రీ.. గొప్ప మనసు..!

-

భారీ వర్షాలతో భాగ్యనగరం మొత్తం వణికి పోయిన విషయం తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భాగ్యనగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో నగరం ఇప్పటికీ కూడా భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల నుంచి కోలుకోలేక పోతుంది. ప్రస్తుతం నగర వాసులు అందరూ అతలాకుతలమై పోతున్నారు. జనావాసాల్లోకి నీరు రావడంతో దుర్భర స్థితి లోనే ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్నారు నగరవాసులు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణ సహాయం కింద 550 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ పెద్దలు కూడా గొప్ప మనసు చాటుకున్న సహాయం చేశారు. తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీ నుండి చిరంజీవి కోటి రూపాయ‌లు, మ‌హేష్ బాబు రూ.కోటి రూపాయ‌లు, నాగార్జున రూ. 50 ల‌క్ష‌లు, ఎన్టీఆర్ రూ. 50 ల‌క్ష‌లు, విజ‌య్ దేవ‌ర‌కొండ రూ.10 ల‌క్ష‌లు, హ‌రీష్ శంక‌ర్, అనీల్ రావిపూడి చెరో రూ. 5 ల‌క్ష‌లు విరాళం అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు.

Read more RELATED
Recommended to you

Latest news