పరీక్షలను వాయిదా వేయగలం కానీ … రద్దు చేయలేం : హై కోర్టు

-

తాము పరీక్షలను వాయిదా వేయగలం కానీ … రద్దు చేయలేమని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని, చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ.. ఎన్​ఎస్​యూఐ సహా మరో రెండు సంస్థలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ విజయ్​సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

జేఈఈ, నీట్​కు మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలు, చివరి సెమిస్టర్ వేర్వేరన్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాటిని రద్దుచేసి.. పది, ఇంటర్ తరహాలో అందరినీ ఉత్తీర్ణులను చేయాలని ఎన్​ఎస్​యూఐ తరఫు న్యాయవాది దామోదర్ రెడ్డి కోరారు. ఈ అంశంపైనా సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయని.. నేడు తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. పిటిషన్లపై విచారణను హైకోర్టు.. ఎల్లుండికి వాయిదా వేసింది

Read more RELATED
Recommended to you

Latest news