ధోనీ టీం కోసం చాలా కష్టపడ్డాడు: రికీ పాంటింగ్

-

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేసాడు. ప్రపంచ వ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ధోనీ గురించే మాట్లాడుకుంటారు అని చెప్పాడు. అతను ఒక మీడియాకు ఇంటర్వ్యు ఇచ్చి అందులో ధోనీ క్రికెట్ కెరీర్ పై అభిప్రాయాలు చెప్పాడు. 16 ఏళ్ళ ధోనీ క్రికెట్ కెరీర్ చాలా అందంగా గడిచిందని పాంటింగ్ అన్నాడు.

తన సహచరులను ధోనీ ఎంతగానో గౌరవిస్తాడు అని చెన్నై సూపర్ కింగ్స్ లో కూడా అంతే అని చెప్పాడు. ధోనీకి నియంత్రణలో ఎలా ఉండాలో తెలుసు అని, ధోనీ ఒకప్పుడు మైదానంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాడు అని చెప్పాడు. కాని వాటిని ధోనీ అధిగమించి ముందుకు వెళ్లి జట్టుని నడిపించిన విధానం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నాడు. అతను మైదానంలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాడన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news