క‌ర్ణాట‌క హిజాబ్ వివాదంపై నేడు హై కోర్టు తుది తీర్పు

-

గ‌త కొద్ది రోజుల ముందు క‌ర్ణాట‌క రాష్ట్రంలో నెల‌కొన్న హిజాబ్ వివాదం ఆ రాష్ట్రంలోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌మాజంలో ఉన్న రెండు ప్ర‌ధాన వర్గాల మ‌ధ్య చిచ్చు పెట్టింది. క‌ర్ణాట‌క రాష్ట్రంలోని విద్యా సంస్థ‌ల్లో విద్యార్థినులు ధరిస్తున్న హిజాబ్ పై పెద్ద వివాదం చోటు చేసుకుంది. క‌ర్ణాట‌క లో ప్రారంభం అయిన ఈ వివాదం దేశ వ్యాప్తంగా పాకింది. కాగ నేడు ఈ హిజాబ్ వివాదంపై బెంగ‌ళూర్ హై కోర్టు తుది తీర్పు వెలువ‌రించ‌నుంది.

కాగ క‌ర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం తెర‌పైకి వ‌చ్చిన స‌మ‌యంలో ఆ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం.. మ‌త చిహ్నాల వ‌స్త్రా ధార‌ణ పై నిషేధం విధిస్తు ఆదేశాల‌ను జారీ చేసింది. ప్ర‌భుత్వ ఆదేశాల‌ను స‌వాలు చేస్తు కొంత మంది ఆ రాష్ట్ర హై కోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌భుత్వ ఆదేశాల‌కు వ్య‌తిరేకంగా దాఖ‌లైనా.. పిటిషన్ల‌ను బెంగ‌ళూర్ హై కోర్టు ప‌ద‌కొండు రోజుల పాటు విచార‌ణ చేప‌ట్టింది. కాగ నేడు తుది తీర్పును ఇవ్వ‌నుంది.

ఈ రోజు ఉద‌యం 10 : 30 గంట‌ల‌కు బెంగళూర్ హై కోర్టు హిజాబ్ వివాదంపై తుది తీర్పును వెలువ‌రించ‌నుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హై అల‌ర్ట్ ను ప్ర‌క‌టించారు. ప‌లు జిల్లాల్లో విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. అలాగే బెంగ‌ళూర్ న‌గ‌రంలో 144 సెక్షన్ ను కూడా విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news