ఇవాళ్టి నుంచే తెలంగాణలో ఒంటి పూట బడులు..టైమింగ్స్‌ ఇవే

-

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి పాఠశాల విద్యార్థులకు ఒంటిపూట బడులు అంటూ గతంలో ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా ఇవాల్టి నుంచి అంటే మార్చి 15 వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.

ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవ సేన సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను ప్రవేటు పాఠశాలల ఊసు ఎత్త లేదు. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే ప్రైవేట్ పాఠశాలలు కూడా తమ టైం టేబుల్ మార్చుకుంటున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఇవాల్టి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఒంటిపూట బడులు సమయం విషయానికి వస్తే ఉదయం ఎనిమిది గంటల నుంచి 12:30 గంటల వరకు పాఠశాలలు పనిచేయవు ఉన్నాయి. పదోతరగతి పరీక్షలు ఈ ఏడాది మే 29 ఉన్నాయి. ఆ రోజే ఈ విద్యా సంవత్సరానికి చివరి రోజు కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news