ఎంపీపీ కుటుంబంపై హ‌త్యాయ‌త్నం

-

న‌ల్ల‌గొండ జిల్లాలో పాత క‌క్ష‌లు భ‌గ్గుమ‌న్నాయి. మంగళవారం అర్థరాత్రి దాటాకా చిట్యాల ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ కుటుంబంపై అర్ధరాత్రి 12 గంటలకు 4 కార్లలో వచ్చిన కిరాయి హంతకులు వారిపై హత్యాప్రయత్నం చేశారు. ఈ ఘటన చిట్యాల మండలం పేరేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అయితే గ్రామంలోని ప్రజలు వెంటపడడంతో ఊర్లో ఉన్న పాత నేరస్థునితో సహా 9 మంది పట్టుబడగా.. మిగతా 15 మంది పరారీలో ఉన్నారు. వివ‌రాల్లోకి వెళ్తే…

పేరేపల్లికి చెందిన కొలను వెంకటేశ్‌, అదే గ్రామానికి చెందిన అంతటి వెంకటేశ్‌ గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచే ఇద్దరు సర్పంచ్‌ ఎన్నికకు పోటీలో నిలిచారు. చెందినవారు. ఈ సందర్భంగా కొలను వెంకటేశ్‌ సర్పంచ్‌ ఎన్నికల్లో అంతటి వెంకటేశ్‌ చేతిలో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కొలను వెంకటేశ్‌ భార్య సునీత పోటీ చేసి గెలిచి చిట్యాల ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఇది జీర్ణించుకోలేని అంతటి వెంకటేశ్‌ కొలను వెంకటేశ్‌పై కక్ష పెంచుకున్నాడు.. దీంతోపాటు ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు చోటుచేసుకున్నాయి. కాగా మంగళవారం ఎంపీపీ సునీత భర్త వెంకటేశ్‌ పుట్టినరోజు పురస్కరించుకొని వేడుక నిర్వహించేందుకు కుటుంబసభ్యులతో కలిసి పేరేపల్లికి వచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news