సత్తెనపల్లి లో తీవ్ర ఉద్రిక్తత.. వైవీ ఆంజనేయులు కార్ ద్వంసం !

-

సత్తెనపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 24వ వార్డ్ లో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు వైవీ ఆంజనేయులు పోలింగ్ బూత్ వద్దకు రావడాన్ని నిరసిస్తూ వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కారు పై అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

దీంతో పోలింగ్ కేంద్రం వద్ద వాతావరణం వేడెక్కింది.  ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం సరికాదని దాడి జరిగిన తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కావాలనే ఎమ్మెల్యే ఆంజనేయులు బూత్ వద్దకు వచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించారని వైసీపీ ఆరోపిస్తోంది. పోలింగ్ కేంద్రం వద్దకు మాజీ ఎమ్మెల్యే తన వాహనంతో రాకూడదని తెలిసినా కూడా వచ్చారని ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి వచ్చారని వైసీపీ 24 వ వార్డు వైసీపీ అభ్యర్థి అచ్యుత శివ ప్రసాద్ ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version