వామ్మో : హైదరాబాద్ లో భర్తని చంపి ఇంట్లోనే పూడ్చేసిన భార్య !

-

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. తన భర్తను చంపి ఇంట్లోనే పాతి పెట్టింది ఓ భార్య.  గత నెల 8వ తేదీ నుంచి గగన్  అగర్వాల్ అనే వ్యక్తి కనిపించడం లేదు. దీంతో గగన్ అగర్వాల్ కనిపించట్లేదు అంటూ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల విచారణలో హత్య ఉదంతం  బయట పడింది. అసలు విష్యం ఏమిటంటే గతేడాది నౌసిన్ బేగం అనే యివతితో గగన్ అగర్వాల్ వివాహం జరిగింది.

murder

ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య ఏర్పడిన గొడవల కారణంగా గగన్  హత్య చేసిన బేగం,  హత్య చేసి ఇంటిలోనే మృతదేహాన్ని పాతి పెట్టింది. గగన్ అగర్వాల్,  నౌసిన్ మధ్య ఏర్పడిన గొడవల కారణంగా నే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మీద అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version