అమరావతిలో టెన్షన్… టెన్షన్.. 144 సెక్షన్ అమలు !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరియాలకు అతీతంగా ప్రతి చోట వైసీపీ మరియు టీడీపీ నాయకుల మధ్యన భారీగా వాగ్వాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు విమర్శిస్తూ ఉంటే… దానికి వైసీపీ నాయకులు కౌంటర్ కు ఇస్తూ పరిస్థితులను అదుపు చేస్తున్నారు. అయితే తాజాగా అమరావతి లో నేతల మధ్య మాటల వేడి సవాళ్ల వరకు వెళ్లింది. ఇరు పార్టీల అవినీతి గురించి మాట్లాడుకుంటూ ఈ రోజు స్థానిక అమరేశ్వర ఆలయంలో ప్రమాణం చేయడానికి పూనుకున్నారు.

ఈ ప్రమాణం చేయడానికి పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ మాటల సవాళ్లు విసురుకున్నారు. ఈ ప్రమాణానానికి అతు వైసీపీ ఇటు టీడీపీ ల నుండి కార్యకర్తలు భారీగా తరలి వస్తుండడం గమనించిన అమరావతి పోలీసులు గొడవలు జరుగుతాయని ముందే ఊహించి ఈ రాత్రి 9 గంటల వరకు 144 సెక్షన్ ను అమలులో పెట్టారు. మరి పోలీసుల మాట వింటే ఈ ఇబ్బంది లేకుండా సజావుగా ప్రమాణం జరుగుతుంది. లేదా చిన్న పాటి గొడవ జరిగినా పోలీసులు చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. మరి ఏమి జరగనుంది అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news