అనంతపురంలో టెన్షన్ : పరిటాల రవి శిలాఫలకం ధ్వంసం..!

-

పేరూరు డ్యామ్ దగ్గర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, దివంగత మాజీ మంత్రి పరిటాల రవి పేరుతో వేసిన శిలా ఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. టీడీపీ కేడర్ భారీగా తరలిరావడంతో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కక్షపూరితంగా గ్రామాల్లో ఇలాంటి చర్యలకు దిగుతున్నారని, గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే శిలాఫలకాలు ధ్వంసం చేశారని సునీత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, మ్దదెలచెరువు సూరి తమ్ముడు గంగుల సుధీర్‌ రెడ్డి ఇదంతా  చేయిస్తున్నారని పరిటాల సునీత ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news