అస్సాం ముఖ్యమంత్రిగా హిమాంత్ బిస్వా శర్మ ప్రమాణ స్వీకారం..

-

ఇటీవల జరిగిన ఎన్నికల్లో అస్సాం రాష్ట్రంలో బీజేపీ గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజాగా అస్సాంప్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిమాంత్ బిస్వా శర్మ ప్రమాణ స్వీకారం చేసారు. అస్సాం గవర్నర్ జగదీష్ ముఖి సమక్షంలో ప్రమాణ స్వీకారం జరిగింది. హిమాంత్ బిస్వా శర్మ అస్సాం రాష్ట్రానికి 15వ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. 2016నుండి 2021వరకు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేసిన సబర్ నంద్ సోనోవోల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అస్సాం పొరుగున ఉన్న ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్‌కు చెందిన బిజెపి ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. హిమాంత్ బిస్వా శర్మ, ఈశాన్య రాష్ట్రాలకి చెందిన నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ (నేడా) కి కన్వీనర్ గానూ పనిచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news