అక్కడ చంద్రబాబు చీటీ చిరగడం ఖాయం..

-


తెలంగాణ ప్రజలను ఇన్నాళ్లు పీడించింది చాలక మళ్లీ తయారైండు ఈ చంద్రబాబు ఆయనకు ఏపీలో చీటీ చిరగడం ఖాయం అంటూ తెలంగాణ మంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. యాకుత్‌పురా నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించాలని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, అది ఎవరితరం కాదని అన్నారు. ఇప్పటికే ఓ వైపు తెరాస అధినేత చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చుతుంటే ..ఇక మంత్రులు సైతం అయన పై గురి పెట్టడం చర్చనీయాంశ మైంది. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జగనే సీఎం అవుతారని జోష్యం చేశారు. ఏపీలో తెదేపా నామరూపాల్లేకుండాపోతుందని వ్యాఖ్యానించారు.

నాలుగున్నరేళ్లలో కేసీఆర్, దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణను అభివృద్ధి చేశారన్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని చీకట్లో ఉంచితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ 24 గంటలు విద్యుత్తు, రైతులకు రైతు బంధు పథకం, రైతు బీమా తో పాలు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version