ప్రేమించి పరువు తీసిందని క‌న్న కూతురిని…!

-

దేశంలో మహిళ‌ల‌పై దాడులు ఆగడంలేదు. దేశంలో ఏదో మూల‌న రోజుకో ఘ‌ట‌న వెలుగు చూస్తూనే ఉంది. ఓ ప‌క్క లైంగిక‌దాడులు మ‌రోప‌క్క ప‌రువు హ‌త్య‌లు నిరాం టంకంగా కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే క‌ర్నాట‌క‌లో చోటు చేసుకుంది. మాగడి తాలూకా బెట్టహళ్లి గ్రామానికి చెందిన హేమలత (18) అనే యువతి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ప రువు హత్యగా నిర్ధారించారు. ఆమె తండ్రి కృష్ణప్ప(48), పెదనాన్న కుమారుడు చేతన్‌(21)ను నిందితులుగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. మరో మైనర్‌ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.

హేమలత కుదూరు లోని ఓ కళాశాలలో బీకాం చదువుతోంది. ఇదే కళాశాలలో చదువుతున్న అన్యమత స్తుడయిన యువకుడిని మూడేళ్లుగా ప్రేమిస్తోంది. ఈ విషయంపై ఇరువైపులా పెద్దల పంచాయితీ కూడా జరిగింది. అయితే వేరే మ‌త‌స్తుడిని ప్రేమించి తమ పరువు తీసిందంటూ హేమలతపై ఆమె కుటుంబ స‌భ్యులు కోపంగా ఉండేవారు. ఈ క్రమంలోనే హేమలత ఈనెల 11న విగతజీవిగా కనిపించింది. ప్రియుడే హత్య చేశాడని వదంతులు పుట్టించారు. కాగా పోలీసుల విచారణలో అస‌లు నిజం బ‌య‌ట‌ప‌డింది. వేరే మ‌త‌స్తుడిని ప్రేమించి త‌మ ప‌రువు తీసింద‌నే అక్క‌సుతోనే తండ్రి, సోదరుడు, మరో బాలుడు కలిసి హేమ‌ల‌తను అంతమొందించారని వెల్లడైంది.

Read more RELATED
Recommended to you

Latest news