వరంగల్ లో పరువు హత్య.. ప్రేమించిందని కూతురును కడతేర్చిన తల్లి..

-

కాలం మారుతోంది.. కట్టుబాట్లు మారుతున్నాయి. అయినా కులం పేరిట ఆఘాయిత్యాలు మారడం లేదు. పెద్దలను ఎదురించి ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడంతో కోపోద్రిక్తులవుతున్న కుటుంబ సభ్యులు తమ పిల్లలను చంపేస్తున్నారు. ఇలాంటి వాటికి మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఓ ఉదాహరణ. తాజాగా ప్రేమించిందనే కారణంగా తన సొంత కూతురునే హత్య చేసింది ఓ తల్లి. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే… వరంగల్ జిల్లా కూతురు కులాంతర వివాహం చేసుకుంటే పరువు పోతుందనే భయంతో సొంత తల్లే తన కుమార్తెను కడతేర్చింది. సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికపోయి నిజం చెప్పింది. వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు.. పెద్ద కుమార్తెకు పెళ్లి చేసింది. ఆ తరువాత సమ్మక్క భర్త చనిపోవడంతో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. చిన్న కుమార్తె అంజలి(17) పదవ తరగతి చదువుతోంది.. ఇదే గ్రామానికి చెందిన రాయపురం ప్రశాంత్ తో ప్రేమలో పడింది. ఇది తెలిసి తల్లి సమ్మక్క చాలా సార్లు కూతురును మందలించింది. అయితే తీరు మారకపోవడవంతో కర్కషంగా ప్రవర్తించింది.

తన కూతురు పెళ్లి చేసుకుంటే పరువుపోతుందని భావించిన సమ్మక్క.. తన తల్లి నాము యాకమ్మతో కలసి గత నెల 19న అర్థరాత్రి అంజలి నిద్రలో ఉండగా ముఖంపై దిండుపెట్టి ఊపిరి ఆడకుండాచేసి దారుణంగా హత్య చేశారు. అనుమానాస్పద మరణం కింద పోలీసులు కేసును నమోదు చేశారు. విచారణలో భాగంగా తల్లి, అమ్మమ్మను విచారించగా కులాంతర వివాహం చేసుకుంటుందనే హత్య చేశామని ఒప్పుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news