ఓటీటీకి ఒకే అంటున్న హాట్ బ్యూటీస్…!

-

ఓటీటీలకు రావడానికి వర్రీ అయిపోయే భామల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. బిటౌన్ బ్యూటీస్ మాదిరిగానే ఇదొక మాంచి సేలబుల్ ఫ్లాట్ ఫారమ్ గా ఫీలౌతున్నారు. కొత్తగా వస్తోన్న సౌత్ బ్యూటీస్ తో వెబ్ సిరీస్ లు త్వరలో మెరుపులు మెరిపించ బోతున్నాయి.

నిజానికి మొన్నటివరకు ఓటీటీలకు వచ్చి నటించాలంటే చాలామంది తారలు భయపడ్డారు.వన్ప్ ఇటు వస్తే అటుసినిమాలు రావనుకున్నారు. ‘కుమారి 21 ఎఫ్‌’ఫేం హెబ్బా పటేల్‌కు మంచి క్రేజ్‌ ఉంది.దీనిని క్యాష్ చేసుకోవడం కోసం ‘మస్తీస్’లో ఆమెకు మంచి అవకాశం వచ్చింది. అలాగే ‘ఆవకాయ్‌ బిర్యానీ’తో వెలుగులోకి వచ్చిన బిందు మాధవి‘మస్తీ్‌స్’తో ఓటీటీలో తళుకున్న మెరిసారు.

టాలీవుడ్ లీడింగ్ బ్యూటీస్ కూడా డిజిటల్ బ్యూటీస్ మారడానికి చూస్తున్నారు.అలాంటివారిలో సమంత, తమన్నా, కాజల్‌ అగర్వాల్‌ పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తమిళ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీ‌స్ లో తమన్నా నటించనుంది.ఇక తమన్నా ప్రధాన పాత్రలో ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్‌ చేయాలని ‘ఆహా’ చర్చలు జరుపుతోంది. సమంతతో ఓ టాక్‌ షో ప్లాన్‌ చేసింది. ఈ రెండూ త్వరలో ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్లిద్దరి ఓటీటీ అరంగేట్రం గురించి ప్రేక్షకులు వెయిటింగ్‌. వీరినే కాకుండా త్వరలో మరింతమంది హీరోయిన్లు డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేసుకోవాలని చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news