శ్రీహాన్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హౌస్ మేట్స్.. ఏమైందంటే..?

-

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ జోరుగా సాగిందని చెప్పాలి. ప్రతి వారం అందరి ముందు నామినేట్ చేసే అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ ఇప్పుడు సీక్రెట్ నామినేషన్ జరిపించారు. రూమ్ లోకి పిలిచి ఎవరిని నామినేట్ చేస్తున్నారో తెలిపి.. రీజన్స్ కూడా చెప్పాలని ఆదేశించాడు. ఇలా ఒక్కొక్కరు ఇద్దరు ఇంటి సభ్యులను రహస్య గదిలోకి వెళ్లి నామినేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నామినేట్ చేసిన ఫోటోలను మిషన్ లో పెట్టి ముక్కలు చేయాలి. అయితే ఈ నామినేషన్స్ లో భాగంగా ముందుగా రోహిత్.. శ్రీహాన్, ఫైమాలను నామినేట్ చేశాడు. అయితే శ్రీహన్ ను ఎందుకు నామినేట్ చేస్తున్నాడో వివరిస్తూ.. టాస్క్ లో మెరీనా విషయంలో గట్టిగా మాట్లాడినందుకు.. శ్రీహాన్ ను నామినేట్ చేస్తున్నానని చెప్పాడు.

అలాగే సంచాలక్ గా ఫైమా సరిగా చేయలేదనే కారణాలతో ఆమెను నామినేట్ చేశాడు . ఆ తర్వాత శ్రీ సత్య.. రాజ్ , రోహిత్ లను నామినేట్ చేయడం జరిగింది. ఇలా ఒక్కొక్కరుగా రీజన్స్ చెప్పి మరీ ఇద్దరు కంటెస్టెంట్లను నామినేట్ చేయడం జరిగింది. అలాగే రాజ్ కూడా శ్రీహాన్, శ్రీ సత్యాను నామినేట్ చేశాడు. శ్రీ సత్య ను నామినేట్ చేస్తూ చెక్ టాస్క్ లో అమౌంట్ చెప్పవద్దని బిగ్ బాస్ చెప్పినా.. ఆమె శ్రీహాన్ కి అమౌంట్ గురించి చెప్పింది.. అందుకే నామినేట్ చేస్తున్నానని అన్నాడు. కీర్తి కూడా శ్రీహన్ ను నామినేట్ చేసింది. ఇలా చాలామంది శ్రీహాన్ ను నామినేట్ చేసి ఊహించని ట్విస్ట్ ఇచ్చారని చెప్పవచ్చు. అలా మొత్తంగా శ్రీహానికి నాలుగోట్లు.. ఫైమా కి మూడు ఓట్లు.. రోహిత్ కి మూడు ఓట్లు.. రాజ్, ఇనయ, శ్రీ సత్య, ఆదిరెడ్డి లకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు చొప్పున పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news