“వాల్తేరు వీరయ్య” నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ప్రొమో..మెగా అభిమానులకు పూనకాలే..

-

మెగాస్టార్​ చిరంజీవి చేస్తున్న లెటేస్ట్‌ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా, చిరంజవి సరసన శృతి హాసన్, కాథరిన్ ట్రెసా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్ లో చిరు సరసన ఆడిపాడింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

గతంలో చిరంజీవి, దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన పలు చిత్రాల్లో పాటలు అదిరిపోయే రేంజిలో హిట్టయ్యాయి. ఈ నేపథ్యంలో, ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్​ వచ్చింది. ఇది ఫ్యాన్స్​కు పూనకాలు తెచ్చేలా ఉంది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమో రిలీజ్‌ అయింది. బాస్‌ పార్టీ అంటూ సాగే ఈ పాట ప్రమోను రిలీజ్‌ చేశారు. రేపు సాయంత్రం 4.05 గంటలకు ఫస్ట్ సింగిల్ ఫుల్‌ సాంగ్‌ ను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news